క్రిమినల్సే బాధితులమని కంప్లైంట్లు ః మంగ్లీ

స్కాం చేసిన వాళ్లే మీడియా ముందుకొచ్చి బాధితులమంటున్నారు. సుభాక్షేత్ర బిజినెస్ అనే పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మధు అనే వ్యక్తి ఎండీగా ఉన్నాడు. మీడియా ముందు బాధితుడుగా మాట్లాడుతున్న హిమాకాంత్ రెడ్డి ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. నేరం వారు చేసి నన్ను నా కుటుంబాన్ని ఇందులోకి లాగుతున్నారు. చాలా డీప్ గా దర్యాప్తు జరపండి అంటూ పోలీసులను కోరారు సింగర్ మంగ్లీ. తనకు సంబంధం లేని ఈ వివాదంలో నలిగిపోతూ రికార్డింగులు, ప్రోగ్రాములు వదులుకుంటున్నానని బాధపడుతోందామె..



