← Back to news

భర్త చెవిలో విషం పోసిన భార్య

By డీకే· 3 Jul 2026· తమిళనాడు
భర్త చెవిలో విషం పోసిన భార్య

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా పుళుదికుడి గ్రామానికి చెందిన రవిచంద్రన్, ఉమారాణి దంపతులు. కొత్త ఇల్లు నిర్మించేందుకు రవిచంద్రన్ వివిధ వ్యక్తులు, సంఘాల నుంచి రూ.10లక్షల లోన్ తీసుకున్నాడు. లోన్ చెల్లించలేకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త చనిపోతే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు అని భావించిన ఉమారాణి, రవిచంద్రన్ గాఢనిద్రలో ఉండగా అతని చెవిలో విషపదార్థం పోసింది. అస్వస్థతకు గురైన రవిచంద్రన్ అప్రమత్తమై తప్పించుకుని స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.