మనవరాలి మరణం తట్టుకోలేక నానమ్మకు గుండెపోటు

TG: జనగాం పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన ప్రియాన్షి (18 నెలలు) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీళ్ల సంపులో పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చిన్నారిని బయటకు తీసి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మనవరాలి మృతితో ఏడుస్తూ నానమ్మ మారబోయిన నాగమ్మ (65) గుండెపోటుకు గురై మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో అంబేడ్కర్ నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.



