సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్

TG : కామారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, రైతుల పరిహారం చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లు విడుదల చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. అధికారులు నేరుగా పొలాల వద్దకు వెళ్ళి రైతులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందించలని అన్నారు.



