చినుకు పడితే చిత్తడి.. ఆదివాసీలకు ఎంత కష్టమో!

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో 244 పంచాయతీలు, 3600 గ్రామాలు. కానీ నేటికీ 2 వేలకు పైగా గ్రామాల్లో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ అంటూ ఏదీ లేదు. 🏚️<br>వర్షం మొదలైతే చాలు – గ్రామాలు బురద మయం. ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు. ఇక ఆరోగ్య పరిస్థితి అంటే.. డయేరియా, మలేరియా, టైఫాయిడ్ – వర్షాకాలం వస్తే ఈ వ్యాధులు బహుమతిగా వస్తాయి. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ⚠️ ఐటిడిఏ "అభివృద్ధి పనులు చేస్తున్నాం" అంటోంది. కానీ ఆచరణలో అభివృద్ధి కనిపించడం లేదు. ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు కల్పించాలి.


