కసాయి తండ్రి: ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని ప్లాన్!

జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడితండా గ్రామంలో ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలనుకున్నాడు ఒక తండ్రి. 20 గుంటల భూమి కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి తన రెండో భార్యతో కలిసి ఇద్దరు కుమారులకు బిస్కెట్లలో విషం కలిపి చంపాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఒకరికి డబ్బు కూడా ఇచ్చాడు. అయితే, ఆ వ్యక్తి భయపడి గ్రామస్తులకు చెప్పడంతో విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులకు 14 రోజులు Remand విధించారు. ఈ ఘోరం స్థానికంగా Sensationగా మారింది.



