← Back to news

భర్తపై యాసిడ్ పోసిన భార్య!

By sahani· 11 Jul 2026· Ambedkar konasima

కుటుంబ కలహాల కారణంగా భర్తపై భార్య బాత్రూమ్ యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో శనివారం జరిగింది. పులపకూరి అర్జున్ కుమార్‌ అనే వ్యక్తిపై అతని భార్య దుర్గా భవాని యాసిడ్‌తో దాడి చేసింది. ఈ ఇన్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలైన అర్జున్‌ను వెంటనే అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.