మోదీ ఇంటి ముందు కూర్చున్న రాహుల్ గాంధీ, ప్రియాంక!
స్టూడెంట్స్ పై జరిగిన పోలీసుల లాఠీచార్జ్, పరీక్షల అక్రమాల వివాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రోడ్డుపైకి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు MPలు ప్రధాని మోదీ ఇంటి ముందు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. నేతల నినాదాలతో ప్రధాని ఇంటి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


