← Back to news

రాష్ట్ర సంక్షేమ కమిటీ సభ్యురాలిగా ఎమ్కెల్యే రాగమయి

By aveen kumar· 26 Aug 2026
రాష్ట్ర సంక్షేమ కమిటీ సభ్యురాలిగా ఎమ్కెల్యే రాగమయి

TG: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అసెంబ్లీలో ఆమె కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కమిటీ చైర్‌పర్సన్‌గా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నియమితులయ్యారు. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై కమిటీ పనిచేయనుంది.

More in Local