రాష్ట్ర సంక్షేమ కమిటీ సభ్యురాలిగా ఎమ్కెల్యే రాగమయి

TG: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అసెంబ్లీలో ఆమె కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కమిటీ చైర్పర్సన్గా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నియమితులయ్యారు. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై కమిటీ పనిచేయనుంది.

