జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు

TG: నల్గొండ జిల్లా నకిరేకల్ టౌన్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శివాజీనగర్లోని ఓ ఇంట్లో ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో నకిరేకల్ పోలీసులు దాడి చేశారు. నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అరెస్ట్ చేశారు. కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన కొందరు RMPల సహకారంతో ఈ ముఠా దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ నిందితులు ఇద్దరూ చివ్వెంల మండలంలో జరిగిన ఓ గర్భిణి మరణం కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.



