Justice for రూపారెడ్డి
TG : నల్గొండలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని అక్షర హైస్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. కొవ్వొత్తులు వెలిగించి, మానవహారంగా ఏర్పడి రూపారెడ్డికి నివాళులర్పించారు. స్కూళ్లలో టీచర్లు, విద్యార్థుల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.



