గొంతు కోసి మహిళ దారుణ హత్య

TG: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మ(50)పై దుండగులు దాడి చేసి కాళ్లు, గొంతు కోసి హతమార్చారు. మహిళ మెడలో బంగారం, చెవులకు కమ్మలు, కాళ్లకు ఉన్న వెండి కడియాల కోసమే దుండగులు మహిళను చంపినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



