స్సైస్ జెట్ కు రూ. లక్ష జరిమానా !

విమానయాన సంస్థ స్పైస్ జెట్కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గట్టి షాక్ ఇచ్చింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్స్లో 'డార్క్ ప్యాటర్న్స్' (వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా అదనపు ఛార్జీలు వసూలు చేయడం) ఉపయోగిస్తున్నందుకు గాను ₹1 లక్ష జరిమానా విధించింది. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వినియోగదారులకు తెలియకుండానే సీట్ సెలెక్షన్, ఇన్సూరెన్స్ వంటి సేవలను ఆటోమేటిక్గా యాడ్ చేస్తూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఇల్లీగల్ పద్ధతు లను వెంటనే నిలిపివేయాలని, పారదర్శకంగా వ్యవహరించాలని స్పేస్జెట్ను CCPA ఆదేశించింది.



