హైదరాబాద్లో Food Festival..3 రోజులే ఛాన్స్!

TG : లక్నో నవాబుల నాటి అవాధి రాయల్ వంటకాలను రుచి చూపించడానికి మాస్టర్ షెఫ్ 'షానవాజ్ ఖురేషి' హైదరాబాద్ వస్తున్నారు. బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో లక్నో రుచికరమైన బిర్యానీలు, కిరాక్ కబాబ్లు, నోరూరించే కర్రీలను లంచ్, డిన్నర్లలో వడ్డించనున్నారు. రాయల్ రుచులను ఇష్టపడే ఫుడ్ లవర్స్ కోసం ఇదొక మంచి అవకాశం.



