← Back to news

గౌరవంగా తప్పుకోండి- ధర్మేంద్రకు ప్రముఖుల లేఖ

By ds· 18 Jul 2026· the wire .in· Delhi
గౌరవంగా తప్పుకోండి- ధర్మేంద్రకు ప్రముఖుల లేఖ

నీట్-యూజీ సహా పలు జాతీయ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 'గౌరవప్రదంగా రాజీనామా చేయాలి' అని కోరుతూ దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రముఖ విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. పరీక్షల లీకేజీలు, అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించడానికి, ఈ పరీక్షల సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.

More in News