Coal gasificationపై కేంద్రం క్లారిటీ

రూ.37,500 కోట్ల Coal gasification పథకానికి కంపెనీల నుంచి రెస్పాన్స్ లేదన్న వార్తలను కేంద్రం ఖండించింది. ఈ ప్రచారం వాస్తవం కాదని బొగ్గు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(TFL), ఎన్టీపీసీ ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు ఇచ్చాయని తెలిపింది. తొలి దశ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 7తో ముగుస్తుంది. ఇతర సంస్థలు కూడా ప్రాజెక్ట్ ప్రతిపాదనలపై పనిచేస్తున్నాయని మంత్రిత్వశాఖ చెప్పింది.



