సోనమ్ వాంగ్చుక్కు అనసూయ సపోర్ట్

నటి అనసూయ భరద్వాజ్ ‘చలో సంసద్’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. ప్రజలు శాంతియుతంగా తమ సమస్యలు చెపుతున్నప్పుడు పాలకులు స్పందించాలని, ప్రశ్నలను స్వాగతించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఒక తల్లిగా పిల్లలకు మెరిట్, నిజాయితీ, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థ అవసరమని, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష ఆ దిశగా ఆలోచింపజేస్తోందని తెలిపారు. జూలై 20 నుంచి జరిగే ‘చలో సంసద్’ కార్యక్రమానికి ఇప్పటికే ప్రకాశ్ రాజ్, అభయ్ డియోల్, అనురాగ్ కశ్యప్, తదితరులు మద్దతు ప్రకటించారు.



