← Back to news

టీచర్‌ లేక మూతపడిన గిరిజన పాఠశాల

By DK· 19 Aug 2026· Jainoor (Ct), Jainoor, Kumuram Bheem Asifabad
టీచర్‌ లేక మూతపడిన గిరిజన పాఠశాల

TG: ఉపాధ్యాయుడు విధులకు హాజరుకాకపోవడంతో పాఠశాలకు తాళం పడింది. కుమురంభీమ్ జిల్లా జైనూర్‌ మండలంలోని పానపటార్‌ పంచాయతీ పరిధి మర్కగూడ ఐటీడీఏ పాఠశాల పది రోజులుగా మూతపడినట్లు గ్రామస్తులు తెలిపారు. పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేయడంతో అధికారులు డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించినప్పటికీ, ఆయన కూడా విధులకు హాజరుకాకపోవడంతో విద్యాబోధన పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. 15 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు తాళం పడటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీచర్‌ లేక మూతపడిన గిరిజన పాఠశాల

More in Local