← Back to news

గవర్నమెంట్ జాబ్ కోసం కన్నతల్లినే చంపేసిన కూతురు!

By sahani· 8 Jul 2026· Rajasthan
గవర్నమెంట్ జాబ్ కోసం కన్నతల్లినే చంపేసిన కూతురు!

రాజస్థాన్ జైపూర్‌లోని ప్రతాప్‌నగర్‌లో దారుణం జరిగింది. తండ్రి చనిపోయాక వచ్చిన గవర్నమెంట్ జాబ్ (LDC), ఆస్తి మొత్తం తనకే కావాలని ఆయుషి అనే యువతి కన్నతల్లి నీరజ్ శర్మ (45)ను చంపడానికి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 23న తల్లిని కార్‌తో గుద్దించి, అది రోడ్ యాక్సిడెంట్‌గా నమ్మించాలని చూసింది. కానీ, ప్రమాదంపై అనుమానం వచ్చి నీరజ్ శర్మ తమ్ముడు రాకేష్ పోలీసులకి కంప్లైంట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్‌లో కూతురు తన చుట్టాలు ఆరుగురితో కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లు తేలింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.