గవర్నమెంట్ జాబ్ కోసం కన్నతల్లినే చంపేసిన కూతురు!

రాజస్థాన్ జైపూర్లోని ప్రతాప్నగర్లో దారుణం జరిగింది. తండ్రి చనిపోయాక వచ్చిన గవర్నమెంట్ జాబ్ (LDC), ఆస్తి మొత్తం తనకే కావాలని ఆయుషి అనే యువతి కన్నతల్లి నీరజ్ శర్మ (45)ను చంపడానికి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 23న తల్లిని కార్తో గుద్దించి, అది రోడ్ యాక్సిడెంట్గా నమ్మించాలని చూసింది. కానీ, ప్రమాదంపై అనుమానం వచ్చి నీరజ్ శర్మ తమ్ముడు రాకేష్ పోలీసులకి కంప్లైంట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్లో కూతురు తన చుట్టాలు ఆరుగురితో కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లు తేలింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.



