కోడూరు బీచ్లో ముగ్గురు చిన్నారుల గల్లంతు

AP: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బీచ్లో స్నానం చేస్తుండగా ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బాలుడు మహమ్మద్ సుఫియాన్ మృతి చెందాడు. ఓ బాలికను జాలర్లు కాపాడగా, మరో బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఆ బాలిక కోసం గాలిస్తున్నారు. సముద్ర స్నానానికి వచ్చి ప్రమాదంలో చిక్కుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



