నేషనల్ హైవేపై మూడు కార్లు బోల్తా.. ఫుల్ ట్రాఫిక్జామ్
TG: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద కారు టైర్ పేలి డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్ను ఢీకొట్టిన కారు అంతటితో ఆగకుండా అవతలి రోడ్డుపై ఎగిరిపడి మరో రెండు కార్లపై పడింది. వరుసగా మూడు కార్లు బోల్తా పడడంతో హైవేపై ఫుల్ ట్రాఫిక్జామ్ అయింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చౌటుప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు.



