ఆర్టీసీపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు... అయినా సమ్మె ఆగదు...

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయినా ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీసమ్మె మొదలు అవుతుందని ఉద్యోగులు తెలిపారు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇంకా చేయకపోవడం, పీఆర్సీ అమలు చేయకపోవడం, వారి ప్రధాన డిమాండ్లు. ప్రభుత్వం స్పందించి నలుగురు సభ్యుల హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా సమ్మె యధాతధంగా కొనసాగుతుందని ఉద్యోగులు అంటున్నారు.

