అన్నదాతల సంక్షేమానికి వెనుకాడం: పొంగులేటి

TG: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం నెలకు రూ.5,250 కోట్లు వ్యయం చేస్తోందని చెప్పారు. హనుమకొండలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతు మేళాలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నదాతల కోసం ఖర్చుకు వెనుకాడటం లేదన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో భూమాయ చేసిందని, భవిష్యత్ తరాలకు భూవివాదాలు లేకుండా భూభారతి తీసుకొచ్చామన్నారు.



