చాక్లెట్ల ఆశచూపి బాలికపై అత్యాచారం

TG: హైదరాబాద్లోని KPHB పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలిక ఇంటి ముందు ఉత్తరప్రదేశ్కు చెందిన రెహాన్ అనే వ్యక్తి పండ్లు అమ్ముకుంటూ ఉండేవాడు. మే నెలలో బాలికతో పరిచయం పెంచుకున్న రెహాన్ తన ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో ఆమె విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. రెహాన్ మరోసారి ఆమెను వేధించడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.



