← Back to news

లంచం ఇవ్వలేదని అతికిన ఎముకనే విరిచేశాడు- ఓ యూపీ డాక్టర్ నిర్వాకం

By DS· 4 Jun 2026· Eenadu· UP
 లంచం ఇవ్వలేదని  అతికిన ఎముకనే విరిచేశాడు- ఓ యూపీ డాక్టర్ నిర్వాకం

యూపీ ముజఫర్ పూర్ కు చెందిన రేష్మ అనే మహిళ తన 14 ఏళ్ల కుమార్తెకు కాలు విరగడంతో గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి డాక్టరు ఆపరేషన్ చేయడానికి లంచం అడగడంతో ఇచ్చుకోలేక మేజిస్ట్రేట్ కి కంప్లయింట్ చేసింది. ఆమెకు ఉచితంగా సర్జరీ చేయాలంటూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే ఆ వైద్యుడు లంచం ఇవ్వనిదే చేయనని మొండికేశాడు.25 వేలు ఇచ్చుకోలేనన్న ఆ మహిళ రూ. 8 వేలు చెల్లించింది. ఆపరేషన్ పూర్తయి కోలుకున్నాక చెకప్ కోసం వెడితే మిగిలిన అమౌంట్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వలేకపోవడంతో కాలును టెస్ట్ చేసే పేరుతో ఇటూ అటూ మెలిపెట్టి నలిపేశాడు. ఇంటికి వెళ్లాక చూడగా కాలు విరిగిపోయింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.