తమిళనాడు' లో .. రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము 'సీజ్'.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ... అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. రేపు జరగనున్న పోలింగ్కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ... భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ ... రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణ బృందాలు ... నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.



