వీధి దీపాలు వేయండి.. ప్రజల ప్రాణాలు కాపాడండి!

AP : ఆదోని మండలం కపటి గ్రామంలో వీధి దీపాలు లేక ప్రజలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలని బీజేపీ మండల అధ్యక్షుడు ఉషారాజు మండిపడ్డారు. వర్షాకాలం కావడంతో చీకట్లో విషపురుగులు, పాముల భయం ఎక్కువైంది. రాత్రి పూట చిన్న పిల్లలు, పెద్దవాళ్లు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పాడైన వీధి దీపాలను బాగు చేయించాలి. కొత్త దీపాలు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.



