బుల్లెట్ రైలుకు భూములివ్వం అంటూ రైతుల ఆందోళన
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహుద్దుర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు టెర్మినల్ కోసం భూములను సేకరించేందుకు హైడ్రా అధికారులు అక్కడికి వచ్చారు. రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు, సరైన పరిహారం ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.



