రూ.158 కోట్ల భారీ రైస్మిల్ కుంభకోణం గుట్టురట్టు

TG: కరీంనగర్ కట్టరాంపూర్ భగత్నగర్కు చెందిన సౌభాగ్య లక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ బండారి మారుతి, పార్ట్నర్ అంజయ్య వీరిద్దరూ పౌరసరపరాల జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్తో CMR ధాన్యం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రభుత్వానికి 2023 సంవత్సరంలో ఇవ్వాల్సిన 3116.360 మెట్రిక్ టన్నులు, 2024లో 2119.125 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ విక్రయాలకు పాల్పడి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.158కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినట్లు పోలీసులు నిర్ధారించారు.



