తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, కడప జిల్లాల్లో, తెలంగాణలోని ఉత్తర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.



