ఆదివాసులుగా గుర్తించాలి.. మా భూములు మాకు ఇవ్వాలి

AP: తమను ఏజెన్సీ ఆదివాసులుగా గుర్తించి, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల గిరిజనులు డిమాండ్ చేశారు. రొంపిల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకోనెల, బూరిగ, సిమ్మిడివలస, రాయపాడు, బొంగుజ తదితర గ్రామాలతో పాటు పలు కొండశిఖర ప్రాంతాల్లో వేలాది మంది ఆదివాసులు జీవిస్తున్నారని తెలిపారు. తమ భూముల్లో సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేర్లు నమోదయ్యాయని ఆరోపించారు.





