కర్ణాటకలో భారీ యాక్సిడెంట్..ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒక మహింద్రాథార్, ఆటో, క్యాంటర్ వాహనాలు ఒకటినొకటి ఢీకొన్నాయి. మూడు వాహనాలు ఒకేసారి బలంగా ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



