పేపర్ లీక్లపై మోదీ ఫస్ట్ రియాక్షన్

నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడేవారికి వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. యువత భవిష్యత్తు, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి, త్వరగా శిక్షలు పడేలా ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని, ఈ ప్రక్రియను వెంటనే అమలు చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని మోదీ స్పష్టం చేశారు.


