← Back to news

చంద్రబాబుతో UAE మంత్రుల భేటీ

By Mahesh· 21 Jul 2026· AP
చంద్రబాబుతో UAE మంత్రుల భేటీ

AP: సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటకశాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సచివాలయంలో భేటీ అయ్యారు. ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. తరువాత ఏపీ ప్రభుత్వం యుఏఈ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. మామిడి, అరటి, కోకో ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఈడీబీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More in Politics