వింత ఘటన.. మొసలికి పూజలు చేసిన భక్తులు

TG : జోగులాంబగద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరదనీటిలో ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. మొసలిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. అయితే అక్కడ ఉన్న భక్తులు మొసలిని వరుణ దేవుని వాహనంగా భావించి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అధికారులు మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.



