ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

AP: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ విశాఖపట్నం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవా అనుభవాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. టెట్ నిర్వహణ తప్పనిసరి చేస్తే అన్ని కేటగిరీలకు 40 శాతం మార్కులను ఉత్తీర్ణత ప్రమాణంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్షను ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ (ఓఎంఆర్) పద్ధతిలో నిర్వహించాలని కోరారు.


