ఇన్స్టాగ్రామ్ పరిచయంతో బాలికపై అఘాయిత్యం!

ఇన్స్టాగ్రామ్ పరిచయంతో ఓ 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా పొక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.19 వేల జరిమానా విధించింది. 2020 కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ వాడుతున్న బాలికకు సిద్దిపేట జిల్లాకు చెందిన వెంకటస్వామి(29) పరిచయమయ్యాడు. ఆపై బెదిరింపులకు గురిచేసి కిడ్నాప్ చేశాడు. బాధితురాలికి ప్రభుత్వం రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ అలర్ట్గా ఉండాలి.



