ప్రభుత్వాలు మారినా.. పథకాలు ఆపొద్దు: KTR

TG: ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి KTR అన్నారు. సిరిసిల్లలో ఇటీవల మృతిచెందిన నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుమార్తె పేరిట రూ.3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ను అందించారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం KCR పేరుతో ఉన్న కంటి వెలుగు, KCR కిట్ వంటి పథకాలను పక్కన పెట్టడం బాధాకరమని విమర్శించారు.



