← Back to news

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల సూసైడ్

By డీకే· 4 Jul 2026· కృష్ణా జిల్లా
ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల సూసైడ్

AP: కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతయ్యపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు సూసైడ్ చేసుకున్నారు. హనుమకొండ రజిని, మధుబాల, గౌరీదేవి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలుగా పోలీసులు గుర్తించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై గూడూరు పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.