తల్లీబిడ్డల అనుమానాస్పద మృతి

AP: వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో అదనపు కట్నం వేధింపుల కారణంగా ఒకే ఇంట్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. భారతి(24) అనే మహిళతోపాటు ఆమె కుమారులు తేజేష్ రెడ్డి(6), హేమనాథ నాగిరెడ్డి(4) చనిపోయి పడి ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. మంచంపై ఉన్న ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, భారతి ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మేనమామ కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



