← Back to news

తల్లీబిడ్డల అనుమానాస్పద మృతి

By RK· 14 Jul 2026
తల్లీబిడ్డల అనుమానాస్పద మృతి

AP: వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో అదనపు కట్నం వేధింపుల కారణంగా ఒకే ఇంట్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. భారతి(24) అనే మహిళతోపాటు ఆమె కుమారులు తేజేష్ రెడ్డి(6), హేమనాథ నాగిరెడ్డి(4) చనిపోయి పడి ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. మంచంపై ఉన్న ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, భారతి ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మేనమామ కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.