← Back to news

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

By Vishi· 30 Jul 2026
వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈనెల 24న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదించింది. ఇవాళ మూజువాణి ఓటుతో లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, ఎవరైనా పాడుతున్న టైంలో ఆటంకం కలిగించినా చట్టప్రకారం నేరంగా పరిగణిస్తారు.

More in India