మందమర్రిలో ప్రారంభమైన కొత్త కోర్టు

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో కొత్త కోర్టు బిల్డింగు ఓపెనైంది. ఇది జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు. దీనిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక ముఖ్య అతిథులుగా పాల్గొని దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందేలా కేసుల పరిష్కారంలో వాయిదాలు తగ్గించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.





