పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి !

ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో పోలీసుల నిర్లక్ష్యానికి ఒక 22 ఏళ్ల కార్ మెకానిక్ బలైపోయాడు. ఆటో డ్రైవర్తో కేవలం 20 రూపాయల విషయంలో వచ్చిన గొడవ కారణంగా, బాధితుడు రాజ్కుమార్ అక్కడే ఉన్న పింక్ పోలీస్ బూత్ తలుపులు బాదాడు. ఆ సమయంలో అద్దాలు పగిలి అతని చేతికి తీవ్ర గాయమైంది. భయపడిన మహిళా పోలీసులు లోపలే తలుపులు వేసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో 40 నిమిషాల పాటు రోడ్డుపై సాయం కోసం అరిచినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.



