← Back to news

పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి !

By DS· 15 Jul 2026· ndtv· UP
పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి !

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో పోలీసుల నిర్లక్ష్యానికి ఒక 22 ఏళ్ల కార్ మెకానిక్ బలైపోయాడు. ఆటో డ్రైవర్‌తో కేవలం 20 రూపాయల విషయంలో వచ్చిన గొడవ కారణంగా, బాధితుడు రాజ్‌కుమార్ అక్కడే ఉన్న పింక్ పోలీస్ బూత్ తలుపులు బాదాడు. ఆ సమయంలో అద్దాలు పగిలి అతని చేతికి తీవ్ర గాయమైంది. భయపడిన మహిళా పోలీసులు లోపలే తలుపులు వేసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో 40 నిమిషాల పాటు రోడ్డుపై సాయం కోసం అరిచినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.