← Back to news

డబుల్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు

By DK· 8 Jul 2026· రాజన్నసిరిసిల్ల జిల్లా
డబుల్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు

TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి జిల్లా కోర్ట్ జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చినట్లు జిల్లా SP మహేష్ బి. గితే తెలిపారు. గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు వేర్వేరు హత్య కేసుల్లో నిందితుడు వంగా సందీప్ రెడ్డికి కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018లో కొత్తపల్లి గ్రామానికి చెందిన బీనబోయిన దేవయ్యను, 2022లో కామారెడ్డి జిల్లాకు చెందిన మన్నె నరసింహులును భూవివాదాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలు, 20 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.