గృహప్రవేశ వేడుకలో బీభత్సం.. కర్రలు, రాళ్లతో దాడి

TG: మేడ్చల్ జిల్లా మేడిపల్లి PS పరిధిలోని బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సుమారు 40 నుంచి 50 మంది వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని చూడకుండా కర్రలు, రాళ్లతో విచక్షణరహితంగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.



