శంషాబాద్ ఎయిర్పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్

TG:శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వీసా మోసం ఘటన కలకలం రేపింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన APలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం తాము విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్ను ఆశ్రయించామని, అతను అసలు వీసాలు అని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చాడని మహిళలు వాపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మహిళలను మోసం చేసిన ముఠా, ఏజెంట్ ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.



