పెద్దకాకాని శివాలయంలో అమ్మవారి నగలు మాయం

AP: గుంటూరు జిల్లా పెద్దకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి 80 గ్రాముల నల్లపూసల మంగళసూత్రం మాయమైంది. దీని విలువ సుమారు రూ.15 లక్షలు. రెండు రోజుల క్రితం గుర్తించిన అర్చకులు ఈవోకు సమాచారం అందించారు. ఆలయ అంతర్గత విచారణలో ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గర్భగుడిలోకి వెళ్లే 17 మంది అర్చకులను పోలీసులు విచారించగా, ఐదుగురిపై అనుమానం వ్యక్తమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



