← Back to news

టూర్ పేరుతో గంజాయి స్మగ్లింగ్.. స్టూడెంట్స్ అరెస్ట్

By DK· 26 Jun 2026· సూర్యాపేట జిల్లా
టూర్ పేరుతో గంజాయి స్మగ్లింగ్.. స్టూడెంట్స్ అరెస్ట్

TG: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఐదుగురు యువకులు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీటెక్ , బీ ఫార్మసీ, ఇంటర్మీడియట్ చదువుతున్న ఐదుగురు స్నేహితులు పర్యాటకం మాటున వెళుతూ గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద 16కిలోల గంజాయి డ్రైపొడిని పట్టుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం నుంచి తెలంగాణలోని కోదాడకు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు కోదాడ ప్రాంతానికి చెందిన షేక్ నజీర్, షేక్ అస్వక్, మహమ్మద్ హఫీజ్‌ఖాన్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి పెద్దిరాజుగా గుర్తించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.