అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

TG: హన్మకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మరిజె అనిత లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందన్నారు. గ్రామంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

