సందడి మాటున బంగారు గొడుగు ఎత్తుకెళ్లిన దొంగలు

AP: నంద్యాల జిల్లా ఔకు మండల కేంద్రంలో మౌలాలి స్వామి పీరుకు అలంకరించిన బంగారు గొడుగును దొంగలు అపహరించారు. సుమారు రూ.2 లక్షల విలువైన 13 గ్రాముల బంగారు గొడుగును గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేశారు. నైలాన్ ధారంతో కట్టిన బంగారు గొడుగును బ్లేడుతో కత్తిరించి కొట్టేశారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి వద్ద సందడి ముసుగులో హల్చల్ చేసిన ఆకతాయిలు, మందుబాబులపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



